5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలో 13 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్ , కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటికి నీరు పోసి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు, స్వచ్ఛమైన గాలి అందించేందుకు మొక్కలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని అన్నారు.
మొక్కలను నాటిన తర్వాత వాటి సంరక్షణ కూడా అంతే ముఖ్యమని, క్రమం తప్పకుండా నీరు పోయడం, రక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మొక్కలను జీవించి పెరిగేలా చూడాలని పేర్కొన్నారు.
Banswada News
పచ్చదన పరిరక్షణే లక్ష్యం...
Quick Summary:
వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులు.
