Banswada News
బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు.
Quick Summary:
జయశంకర్ ఆశయాలతోనే తెలంగాణ సాకారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్.
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు, మార్గదర్శకత్వమే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదిగా నిలిచాయని అన్నారు. ఆ ఆశయాలను బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లడంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. జయశంకర్ ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, ఖలీల్, మాక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు అక్బర్, నాయకులు అబ్దుల్ ఖాదర్, రమేష్ యాదవ్, మోచి గణేష్, అతిఫ్ అజీమ్, లాయక్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.