Banswada News
ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం
Quick Summary:
ఓటరు జాబితా సవరణపై కీలక చర్చ
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఆర్డీవో రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఎస్ఆర్–2026)పై ఆల్పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ రాజా నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కాపర్తి సంగమేశ్వర్, బీఎల్వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,100 మందికి పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త బూత్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నసుర్లాబాద్ మండలం అంకోల్ తండా (పీఎస్–157)లో కొత్త బూత్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోతంగల్లోని బూత్ నంబర్లు 8, 9, 10, 11, 12, 244, 245లలో ఓటర్ల మార్పిడిని సరిచేసి సంబంధిత బూత్ల్లోనే విలీనం చేయనున్నట్లు తెలిపారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు ఆగస్టు 10 చివరి తేదీ కాగా, ముసాయిదా ఓటరు జాబితాను ఆగస్టు 17న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.